న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు అమలవుతువంది. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. దేశంలోని దాదాపు 7 కోట్లకు పైగా ఉన్న ఈపీఎఫ్ఓ మెంబర్లు లాభపడతారు.
వడ్డీ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఏడాది మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ వడ్డీ రేటును ఖరారు చేశారు. 2023–24, 2024–-25 ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఇదే వడ్డీని కొనసాగించారు. ఈసారి వడ్డీ రేటు ఆమోదం పొందిన వెంటనే సబ్స్క్రయిబర్ల ఖాతాల్లోకి నిధులు జమ అవుతుంది .
భారత ప్రభుత్వం ఈపీఎఫ్కి గ్యారెంటార్గా వ్యవహరిస్తోంది. కాబట్టి, సీబీటీ నిర్ణయించిన రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఆ ప్రక్రియ పూర్తయింది.
