సీఎంతో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

సీఎంతో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

హైదరాబాద్, వెలుగు : ప్రపంచంలోనే ప్రముఖ మెమరీ చిప్​ల తయారీ కంపెనీ మైక్రాన్ ​టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్​మెహ్రోత్రా సీఎం రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్.. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో రేవంత్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మైక్రాన్​కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. కాగా, అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్​లు తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటి.