
క్రౌడ్ స్ట్రైక్ లాంచ్ చేసిన తాజా అప్డేట్ వల్లే ఈ సమస్య వచ్చిందని, దీనిని ‘క్రిటికల్’ సమస్యగా పేర్కొంటూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకా సిస్టమ్ క్రాష్ అవడం లేదా ఆన్ లైన్లో ఉండేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న వారు ఏం చేయాలనేదానిపై ఒక అడ్వైజరీని జారీ చేసింది.
విండోస్ సిస్టమ్ను సేఫ్ మోడ్లోకి బూట్ చేయాలి. లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్ మెంట్కు బూట్ చేయాలి.ఆ తర్వాత C:Windowsystem32driversCrowdStrike directoryకి వెళ్లాలి.అక్కడ "C-00000291*.sys" అనే ఫైల్ను సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయాలి.అనంతరం నార్మల్గా హోస్ట్ను బూట్ చేయాలి.
సమస్యను పరిష్కరిస్తున్నాం..
క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇటీవల తెచ్చిన అప్డేట్తో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్ పై ప్రభావం పడింది. సమస్యను పరిష్కరించేందుకు మేం క్రౌడ్ స్ట్రైక్తో కలిసి యాక్టివ్గా పని చేస్తున్నాం. సిస్టమ్స్ ను సురక్షితంగా రీస్టోర్ చేసుకునేందుకు వీలుగా చేపట్టాల్సిన రికవరీ ప్రాసెస్పై కస్టమర్లను మా ఎక్స్ పర్ట్ లు గైడ్ చేస్తారు.
- సత్య నాదెళ్ల,
చైర్మన్ అండ్ సీఈవో, మైక్రోసాఫ్ట్