చైన్ స్నాచింగ్ కి పాల్పడిన నిందితుల రిమాండ్

చైన్ స్నాచింగ్ కి పాల్పడిన నిందితుల రిమాండ్

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సిపిఆర్ఐ వద్ద ఓ మహిళ టీ స్టాల్ నడుపుతోంది. ఈ క్రమంలో మే 5న ఇద్దరు యువకులు ఆ మహిళ దగ్గర టీ తాగడానికి వచ్చారు. అదును చూసి మహిళ కళ్లల్లో కారం కొట్టారు. అనంతరం ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. తేరుకున్న మహిళ వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన ఇద్దరు నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి.. బంగారు గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని డీసీపీ జానకి తెలిపారు.