మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని యవత్మాల్లో మోదీ పాల్గొనటానికి ఓ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరుకానున్నారు. ఈ మెగా ఈవెంట్ 47 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన వేదికలో జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున జనం రానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఈ రోజు ఉదయం ఆ సభ ఏర్పాట్లలో భాగంగా కుర్చోడానికి కుర్చీలు వేశారు. అయితే, ఆ కుర్చీలకు కాంగ్రేస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్టిక్రర్లు ఉన్నాయి. దీంతో బీజేపీ సభలో రాహుల్ గాంధీ డొనేట్ చేసిన కుర్చీలు వేశారని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Yavatmal meh Modi ki aaj ki ralley meh Congress Rahul Gandhi ji k donate drive walle stickers walli chairs lagi hui hai😁😁😁 pic.twitter.com/1Nj5bVv4y7
— Pritesh Shah (@priteshshah_) February 28, 2024
అసలు ఏం జరిగిందంటే.. ఈ ప్రాంతంలో ఇటీవల కాంగ్రెస్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్చీలు పంపించిన కాంట్రాక్టరే బీజేపీ మీటింగ్ లో కుర్చీలు సరఫరా చేశారు. కాంగ్రెస్ ర్యాలీలో వేసిన కుర్చీలకు రాహుల్ గాంధీ స్టిక్కర్లు అతికించారు. అదే కుర్చీలు స్టిక్కర్లు తీయకుండానే యవత్మాల్ సభకు పంపించారు. దీంతో ఆ సభ ఏర్పాటులో పెద్ద వివాదం జరిగి కుర్చీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.