–ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని చనాక–కోరట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్) పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్తెలిపారు.
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మాజీ మంత్రి పేరును బ్యారేజీకి పెట్టడంతో జిల్లా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఙతలు తెలిపారు.
