చందానగర్లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద మృతి

చందానగర్లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ చందానగర్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఉదయం తన బైక్ పై స్విగ్గీ డెలివరీ కోసం బయలుదేరిన అనిల్.. నల్లగండ్ల వెరిటేక్స్ విల్లా నిర్మాణాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర మృతి చెందాడు. 

అనిల్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరెంట్ షాక్ తగిలి అనిల్ మృతి చేందినట్లు అనుమానించారు. అనిల్ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.