
ప్రేమమ్, సవ్యసాచి, కార్తికేయ, చిత్రాలకు దర్శకత్వం వహించి తన కంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి. తను దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కార్తికేయ 2".. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది..ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్నది.
మనం నమ్మేదంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది..
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు చందు మొండేటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.."చిన్నప్పటి నుండి నేను రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మేదంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్ దాన్ని బట్టి ఈ సినిమాను తీయడం జరిగింది. అందుకు కృష్ణతత్త్వంను కాన్సెప్ట్ గా తీసుకొని ఇప్పటితరానికి అయన గొప్పతనం గురించి చెప్పబోతున్నాము. శ్రీకృష్ణుడిని మోటివ్ గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు దాని డెఫినేషన్ అంతా అర్థమయ్యేలా కొంతవరకు చూయించాను. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదని భక్తితో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు.
అందుకే స్వాతిని తీసుకోలేదు..
కార్తికేయ 1 హిట్ అవ్వడంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. "కార్తికేయ 1" లో నిఖిల్ హీరోగా చెయ్యడంతో "కార్తికేయ 2"లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వైవా హర్ష, సత్య వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. "కార్తికేయ 2" లో స్వాతి పాత్రకు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమైపోతుంది లగే రహో మున్నాభాయ్ కంటే ముందు మున్నాభాయ్ MBBS సినిమాలా క్యారెక్టరైజేషన్స్ క్యారీ చేస్తుంది. కానీ కథ మాత్రం వేరు.
ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు..
కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది. ఆయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవిపుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు. ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. "కార్తికేయ 2" కు బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది. అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు. ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా..
కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తోనే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వియఫ్ఎక్స్ చాలా బాగా వచ్చింది. థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాశాలపై ఒక అవగాహన వస్తుంది. నేను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను. ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు సినిమా కథలు ఉన్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రమైతే ఇంకొకటి సోషల్ డ్రామా, ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జునతో మరో చిత్రం చేయబోతున్నాను. కరోనా రాకుండా ఉంటే ఇవి సెట్స్ పై ఉండేవి అని" చందు మొండేటి ముగించారు.