జగన్ కు చంద్రబాబు సవాల్: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి

జగన్ కు చంద్రబాబు సవాల్: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమరావతే రాజధాని అని మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు మాటమారుస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా జనాలను మభ్యపెట్టి ఇప్పుడు మూడు రాజధానులంటూ మాట్లాడుతోందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల్లో మద్దుతు ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనీ..వైసీపీ గెలిస్తే ఇక మేం మాట్లాడబోమని స్పష్టం చేశారు. 48 గంటలలో తన సవాల్ పై స్పందించాలన్నారు  చంద్రబాబు. పార్టీ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పోల్చిన వైసీసీ నేతలకు తప్పుడు నిర్ణయాలతో రాజధాని మార్చే హక్కులేదన్నారు.