జూలూరు పీఏసీఎస్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు

జూలూరు పీఏసీఎస్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు

యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలు పేమెంట్స్​లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాదాద్రి జిల్లా జూలూరు పీఏసీఎస్​ సెక్రటరీ ఆర్​ నర్సింహపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్​ అనురాగ్​ జయంతి ఆదేశాలు జారీ  చేశారు.

పెద్ద రావులపల్లి పీఏసీఎస్​  సెంటర్​లో వడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాకుండా ఇతరుల అకౌంట్లలో జమ చేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేయడంతో డిస్ట్రిక్​ కో ఆపరేటీవ్​ ఆఫీసర్​ నాగార్జున విచారణ చేపట్టి పీఏసీఎస్​ సెక్రటరీ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, కలెక్టర్​కు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా సెక్రటరీ నర్సింహపై సస్పెన్షన్​ వేటు పడింది.