చంద్రబాబు, పవన్ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి… ఏంటయ్యా… మీ నీచ రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీచేస్తారో ఆయనకే తెలియదన్నారు, పవన్ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్కు ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు, ఓటు లేదన్నారు. నాదెండ్ల మనోహర్ ఇచ్చిన స్లిప్పును బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చదువుతాడని అంబటి అన్నారు. ఇక పవన్ కు గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బానిసగా ఉంటూ.. లోకేష్ పల్లకీ మోస్తున్నాడని... ఒకరి పల్లకీలు మోసే వ్యక్తులను జనాలు నమ్మేందుకు సిద్దంగా లేరన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్ కు ఉందా అని ప్రశ్నించారు, తెలంగాణ రాజకీయాల ప్రభావం ఏపీపై ఉండదని.. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా.. తమతో సత్సంబంధాలే ఉంటాయన్నారు. వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా నంటూ.. ఏపీ లో వారాహి యాత్ర చంద్రబాబు డైరక్షన్ లో వెళుతుందన్నారు.