చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 9న లిస్టింగ్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 9న లిస్టింగ్

టీటీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టులో సోమవారం( అక్టోబర్ 9)  లిస్టింగ్ అయింది. ఇప్పటికే ఈ  కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను  జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు.