వైఎస్ నాకు మంచి మిత్రుడు: చంద్రబాబు

వైఎస్ నాకు మంచి మిత్రుడు: చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తనకు మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే కాని వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తనకు మంచి మిత్రుడని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఏపీ శాసనసభలో అక్రమ కట్టడాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అక్రమంగా కొన్నివేల వైఎస్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. దీంతో ఆందోళన చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. రాష్ట్రంలో వైఎస్ విగ్రహాలు చూసి చంద్రబాబు కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు.

దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. విగ్రహాలను తొలగించాలని తాననడం లేదని చెప్పారు. వైఎస్‌ తనకు మంచి మిత్రుడని, రాజకీయపరంగా మాత్రమే విభేదాలుండేవని అన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరమూ ఒకే గదిలో ఉండేవాళ్లమని చంద్రబాబు చెప్పారు.