
కాళేశ్వరం డిజైన్ల మార్పు పూర్తిగా ఇంజినీర్ల నిర్ణయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్ ల మార్పు టెక్నికల్ అంశమని.. అది ఇంజినీర్లే నిర్ణయం తీసుకుంటారని కమిషన్ కు చెప్పినట్లు తెలిపారు. సోమవారం (జూన్ 9) కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణలో అడిగిన ప్రశ్నలు, వివరాల గురించి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన వివరాలు:
- కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా
- కేవలం నోటి మాటలే కాదు.. రాత పూర్వకంగా వివరాలుఅందించాను
- ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టాం
- తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని అడిగారు
- తమ్మడిహెట్టి దగ్గరే కట్టాలని అనుకున్నాం.. కానీ
- మహారాష్ట్ర అభ్యంతరాల వలన మార్చాల్సి వచ్చింది ..
- తమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టును ఒప్పుకోమని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది
- ప్రాజెక్టు గురించి మహారాష్ట్రతో 5, 6 సార్లు సమావేశాలు జరిగాయి
- మీటింగ్ సారాంశాన్ని కమిషన్ కు వివరించాం
- 2014 కు ముందు ఈ ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా రూపకల్పన చేశారు
- తమ్మిడిహెట్టి దగ్గర పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో తవ్వారు
- నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చాం
- కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శిస్తున్నారు
- కానీ.. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైమ్ లైట్.. జీవధార
- గత ప్రభుత్వం 7 ఏండ్లలో పర్మిషన్ కూడా తీసుకురాలేకపోయింది
- కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు.. ఉందని వివరాలు ఇచ్చాం
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి అడిగారు..
- టెక్నికల్ ప్రాబ్లం.. ఇంజినీర్లు తీసుకునే నిర్ణయమని చెప్పాం.
- గతంలో ఎన్నో ప్రాజెక్టులు డిజైన్లు మారాయి..
- నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా డిజైన్లు మారాయి..
- ఇది కూడా టెక్నికల్ ప్రాబ్లంతో మార్చామని చెప్పాం.
- రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత అని అడిగారు
- 141 టీఎంసీలు అని చెప్పాం
- కాళేశ్వరంలో వంద భాగాలున్నాయి..
- సీఎం రేవంత్ గంధమళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు
- గంధమళ్ల కు నీళ్లు కాళేశ్వరం నుంచే వస్తాయి
- మూసీ సుందరీకరణకు నీళ్లు కాళేశ్వరం రావాలి
- మరోవైపు కాళేశ్వరం కూలిందని చెబుతారు
- రేపు (మంగళవారం, జూన్ 10) తెలంగాణ భవన్ లో మిగతా ప్రశ్నలకు సమాధానం చెబుతాం..