స్టాఫ్​నర్స్​ ఎగ్జామ్..సెంటర్లలో మార్పులు

స్టాఫ్​నర్స్​ ఎగ్జామ్..సెంటర్లలో మార్పులు

హైదరాబాద్​, వెలుగు :  భారీ వర్షాలు, వరదల కారణంగా స్టాఫ్​ నర్స్​ ఎగ్జామ్​ సెంటర్లలో తెలంగాణ మెడికల్​ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ఖమ్మంలోని పరీక్షా కేంద్రాలను మార్చినట్టు ఆదివారం ఓ ప్రకటనలో బోర్డు తెలిపింది. తొలి షెడ్యూల్​ సెషన్​ 1, 2, 3 ప్రకారం ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ ఫర్​ విమెన్​ సెంటర్​లో జరగాల్సిన పరీక్షలను.. స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ సైన్స్​ కేంద్రాల్లోకి మార్చినట్టు బోర్డు వెల్లడించింది.

టైమింగ్స్​లో మాత్రం ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేసింది.  ఆగస్టు 2న స్టాఫ్​ నర్స్​ రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్​లో 2, వరంగల్​లో 8 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 5,204 పోస్టులకు మొత్తం 40,936 మంది అప్లై చేసుకున్నారు. సెషన్​1 పరీక్షకు రిపోర్టింగ్​ టైం ఉదయం 7.30. సెషన్​ 2  ఉదయం11 గంటలు, సెషన్​3 మధ్యాహ్నం 2.30 గా పేర్కొన్నారు.