భద్రాచలం, వెలుగు: నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఓ మాజీ సర్పంచ్ 33 నెలల తర్వాత మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గోటా మహేశ్ను 2023 ఆగస్టులో మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి రెండు రోజుల తర్వాత కుట్రూ–ఫర్సేగఢ్ మార్గంలో వదిలేశారు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా, కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్, ఢిల్లీ సహా పలు ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మహేశ్ తండ్రి గోటా చెన్నారాంను కూడా 2012లో మావోయిస్టులు కాల్చి చంపేశారు.
