HDFC బ్యాంక్‌‌‌‌ సీఈఓ జగదీశన్‌‌‌‌పై చీటింగ్ కేసు.. 20 ఏళ్లలో రూ.1,250 కోట్ల ఫ్రాడ్ జరిగిందా..?

HDFC బ్యాంక్‌‌‌‌ సీఈఓ జగదీశన్‌‌‌‌పై చీటింగ్ కేసు.. 20 ఏళ్లలో రూ.1,250 కోట్ల ఫ్రాడ్ జరిగిందా..?

ముంబై:  లీలావతి హాస్పిటల్‌‌‌‌ను నడిపే లీలావతి కిర్తీలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్ట్)  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్  సీఈఓ శశిధర్ జగదీశన్ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆయన్ని  వెంటనే సస్పెండ్ చేసి, విచారించాలని డిమాండ్ చేసింది. ట్రస్ట్‌‌‌‌లో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్‌‌‌‌లో  జగదీశన్ హస్తం ఉందని పేర్కొంది. 

ఈ ఆరోపణలను హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ స్పోక్స్‌‌‌‌పర్సన్ ఖండించారు.  ట్రస్ట్, దాని ట్రస్టీలు, ఆఫీసర్స్  నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని  తోసిపుచ్చారు . “ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్టీ ప్రశాంత్ మెహతా, అతని ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్‌‌‌‌కు చాలా డబ్బు బాకీ ఉన్నారు.  అది ఎప్పుడూ తిరిగి చెల్లించలేదు” అని పేర్కొన్నారు. 

  “హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ  బ్యాంక్ బోర్డ్, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, సెబీ, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్లు జగదీశన్‌‌‌‌ను ఎగ్జిక్యూటివ్, బోర్డ్ రోల్స్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి.  సీజ్ చేసిన క్యాష్‌‌‌‌ డైరీ ప్రకారం, రూ.14.42 కోట్లు ట్రస్టీలు కొట్టేశారని, అందులో రూ.2.05 కోట్లు జగదీశన్‌‌‌‌కు వెళ్లాయని తేలింది. ఆ తర్వాతనే బొంబాయి మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌‌‌‌తో ఆయనపై కేసు రిజిస్టర్ అయింది. ఫ్రాడ్‌‌‌‌లో జగదీశన్‌‌‌‌  డైరెక్ట్‌‌‌‌గా ఇన్వాల్వ్ అయ్యాడు ”అని  ఎల్‌‌‌‌కేఎంఎం పేర్కొంది.  

ఈ కేసులో మరో 7 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్ట్‌‌‌‌లో పాత, కొత్త మెంబర్స్ మధ్య గొడవ చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. 2023లో, లాంగ్ లీగల్ ఫైట్ తర్వాత కిషోర్ మెహతా ఫ్యామిలీకి ట్రస్ట్ కంట్రోల్ ఇచ్చారు.  విజయ్ మెహతా ఫ్యామిలీ ఓడిపోయింది. 

గత రెండు దశాబ్దాల్లో రూ.1,250 కోట్ల విలువైన ఆర్థిక మోసం జరిగిందనే ఆరోపణలపై లీలావతి హాస్పిటల్‌‌‌‌కు చెందిన 7 మాజీ ట్రస్టీలు, మరో 10 మందిపై  ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది మార్చి 6న చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయింది. గత ఏడాది జూన్ నుంచి ఇది మూడో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌.