- ట్రాప్ బోన్లు ఏర్పాటు.. కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలంలో చిరుత పులి సంచరిస్తోంది. శనివారం అర్ధరాత్రి ఘన్సిమియాగూడ పరిసరాల్లో తిరుగుతూ రెండు లేగ దూడలు, ఓ కుక్కపై దాడి చేసింది. ఆదివారం రాత్రి శంకరపురం గ్రామంలోని ఐఎంటీ కాలేజీ సమీపంలో తిరుగుతుండగా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్అయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సోమవారం ఐదు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు.
శంకరపురంతోపాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుత సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకి రావాలంటే వణికి పోతున్నారు.