Cheteshwar Pujara: టీమిండియాలో నో ఛాన్స్.. రిటైర్మెంట్‌పై స్పందించిన పుజారా

Cheteshwar Pujara: టీమిండియాలో నో ఛాన్స్.. రిటైర్మెంట్‌పై స్పందించిన పుజారా

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ జట్టులో టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారాకు స్థానం దక్కించుకోలేకపోయాడు. 2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో భాగంగా ఈ సీనియర్ ప్లేయర్ ను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో పుజారా భారత్ తరపున 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.

దేశవాళీ క్రికెట్ లో బాగా రాణిస్తూ తనను తాను నిరూపించుకున్న పుజారా.. ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం వస్తుందని భావించినా అది జరగలేదు. 100 టెస్టులు ఆడినా పుజారా అనుభవాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకపై టీమిండియాలో పుజారా చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పుజారా తన రిటైర్మెంట్ పై స్పందించాడు. " క్రికెట్ కు నేను రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో లేను. నేను ఇంకా పూర్తి చేయాల్సిన పని ఉందని అనుకుంటున్నాను. నేను నా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. నేను నా ఆటను కొనసాగిస్తాను. రిటైర్మెంట్ గురించి తరువాత ఆలోచిస్తాను. నాకు వర్తమానంలో జీవించడం ఇష్టం". అని పుజారా అన్నాడు.

►Also Read : ఇండియాలో కోహ్లీనే టాప్

పుజారాకు ఇకపై టీమిండియాలో కనిపించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించిన అతను ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడుతూ  నిలకడగా రాణించాడు. బాగా ఆడుతూ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 103 టెస్ట్‌ల్లో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. వీటిలో 19 సెంచరీలు.. 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సౌరాష్ట్ర తరపున ఆడిన తర్వాత దేశీయ క్రికెట్‌లో ఆడుతున్నాడు .