
- ఇప్పటివరకు అందుతున్న 4,011 మందికి ఇది రెట్టింపు
- ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందజేత
హైదరాబాద్, వెలుగు: కిడ్నీ సంబంధ సమస్యలు, తలసేమియా, సికెల్సెల్వ్యాధులతో బాధపడుతూ రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4,021 మంది డయాలసిస్బాధితులకు మే నెల నుంచి పింఛన్ అందించేందుకు నిర్ణయించింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్వరకు 4,011 మంది డయాలసిస్ బాధితులకు మాత్రమే పింఛన్అందుతుండగా.. మేలో కొత్తగా 4,021 మంది పేషెంట్లకు చేయూత పింఛన్ మంజూరు చేయడంతో ఒక్కనెలలో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందనుంది.
కిడ్నీ సమస్యలు, తలసేమియా, సికెల్సెల్వ్యాధులతో బాధపడ్తూ రెగ్యులర్గా డయాలసిస్చేయించుకుంటున్నవారిలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా ఉన్నారు. వారం, వారం రక్తమార్పిడి చేయించుకోవాల్సి రావడం వల్ల చాలా మంది వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. దీంతో తమకూ పింఛన్ ఇవ్వాలని వారంతా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో పింఛన్లు ఇవ్వలేదు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ కాలంలోనే పింఛన్లను రెట్టింపు చేయడంపై ఆయా రోగులు, వారి సంబంధీకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
త్వరలో హెచ్ఐవీ బాధితులకు పింఛన్?
త్వరలో మరింత మంది హెచ్ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 13వేల మంది హెచ్ఐవీ బాధితులు తమకు పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థికశాఖకు పంపించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. క్లియరెన్స్ రాగానే వారికి కూడా పింఛన్ మంజూరు చేసే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం ప్రతి నెలా రూ.993 కోట్ల వరకు చెల్లిస్తోంది. కొత్త పింఛన్దారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం భారీగా పెరగనుంది.
జిల్లాల వారీగా ‘చేయూత’ పింఛన్ దారుల వివరాలు ఇలా..
జిల్లా బాధితుల సంఖ్య
ఆదిలాబాద్ 153
భద్రాద్రి– కొత్తగూడెం 267
హనుమకొండ 195
హైదరాబాద్ 848
జగిత్యాల 200
జనగామ 138
జయశంకర్ భూపాలపల్లి 53
జోగులాంబ గద్వాల 124
కామారెడ్డి 194
కరీంనగర్ 277
ఖమ్మం 285
కుమ్రం భీం ఆసిఫాబాద్ 108
మహబూబాబాద్ 156
మహబూబ్ నగర్ 204
మంచిర్యాల 180
మెదక్ 164
మేడ్చల్మల్కాజిగిరి 705
ములుగు 42
నాగర్కర్నూల్ 168
నల్గొండ 434
నారాయణపేట 114
నిర్మల్ 122
నిజామాబాద్ 365
పెద్దపల్లి 197
రాజన్న సిరిసిల్ల 134
రంగారెడ్డి 685
సంగారెడ్డి 280
సిద్దిపేట 249
సూర్యాపేట 258
వికారాబాద్ 181
వనపర్తి 108
వరంగల్ 213
యాద్రాద్రి భువనగిరి 231