ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ గఢ్ సీఎం

ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ గఢ్ సీఎం

ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. సీఎం కొరడాతో కొట్టించుకోవడం ఏంటి అనే కదా డౌట్. అయితే సీఎం బాఘేల్ కొరడా దెబ్బలు తినడం వెనుక బలమైన కారణమే ఉంది. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆయన తన వయసును కూడా పట్టించుకోకుండా కొరడాతో కొట్టించుకున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా జజంగీర్ గ్రామంలో ఏటా దీపావళి తర్వాత  గోవర్ధన్ పూజ జరుగుతుంది. ఈ పూజలో పాల్గొని కొరడాతో కొట్టించుకుంటే కోరినది జరుగుతుందని ఓ నమ్మకం. ఇందులో భాగంగానే సీఎం భూపేశ్ బాఘేల్ పూజలో పాల్గొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా దీవించాలంటూ చేతిపై కొరడాతో కొట్టించుకున్నారు.

గోవర్ధన్ పూజ లో పాల్గొన్న సీఎం ఇక్కడ కొరడాతో కొట్టించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.