ఆదివాసీ లోకం మోదీకి అండగా నిలబడాలి: చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్

ఆదివాసీ లోకం మోదీకి అండగా నిలబడాలి: చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్

భద్రాచలం,వెలుగు : ఆదివాసీ లోకం ప్రధాని మోదీకి అండగా నిలబడాలని చత్తీస్​గఢ్​సీఎం విష్ణుదేవ్​సాయి పిలుపునిచ్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. ఆదివాసీలకు పెద్ద పీఠ వేసింది బీజేపీనే అని, వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలన్నారు. చత్తీస్​గఢ్​కు, తెలంగాణకు దగ్గరి సంబంధాలున్నాయని, దక్షిణ అయోధ్య భద్రాచలంలో రాముడు వెలిస్తే, ఆయనకు జన్మనిచ్చిన తల్లి కౌసల్యది చత్తీస్​గఢ్​ అని అన్నారు.

కాకతీయ క్లస్టర్​లోని ఖమ్మం, మహబూబాబాద్​,వరంగల్​పార్లమెంట్​స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు. కాకతీయుల సామ్రాజ్య వారసులు బస్తర్​రాజు కమల్​చంద్​ బంజ్​దేవ్​,గుజ్జుల ప్రేమ్​చంద్రారెడ్డి, ధర్మారావు, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రంగా కిరణ్, కామారెడ్డి ఎమ్మెల్యే టి. వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. తర్వాత చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​సాయి రాములవారిని దర్శించుకున్నారు. ఈవో రమాదేవి నేతృత్వంలో అర్చక బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. తర్వాత ఈవో సచిత్ర రామాయణ పుస్తకాన్ని బహుకరించారు.