కార్తీక మాసం అయిపోయింది.. చికెన్ @ రూ. 260

కార్తీక మాసం అయిపోయింది..  చికెన్ @ రూ. 260

హైదరాబాద్,వెలుగు: జంట నగరాల్లో చికెన్​ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల కిందట కిలోకు రూ. 150 ఉంది.  ప్రస్తుతం కిలోకు రూ. 240 నుంచి రూ. 260 పెరిగిపోయాయి. కార్తీక మాసం కారణంగా నెలరోజుల పాటు నాన్​వెజ్​తినే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో చికెన్​ ధరలు తగ్గాయి. కార్తీక మాసం అయిపోవడంతో మళ్లీ ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మటన్ ధర కంటే చికెన్​ధర తక్కువగా ఉంటుండగా ఎక్కువమంది తినేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. 

దీంతో డిమాండ్ కూడా​పెరుగుతుండగా మళ్లీ ధరలు కూడా పెంచేశారు. వింటర్ లో చాలా మంది నాన్​వెజ్​ ప్రియులు చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. దీని కారణంగానే ధరలు కూడా పెంచేసినట్టు తెలుస్తుంది. జంటనగరాల్లో సాధారణ రోజుల్లో రోజుకు 1.25 లక్షల నుంచి 1.5 లక్షల చికెన్​ వాడకం అవుతుంది. పండగలు, సెలవు రోజుల్లో దాదాపు 2 లక్షల కేజీలు అమ్ముడుపోతున్నట్టు చికెన్ వ్యాపారులు తెలిపారు.