KTR చిట్టా మొత్తం నా దగ్గరుంది.. లోకేష్ ను అర్థరాత్రి ఎందుకు కలిశాడు : సీఎం రేవంత్ రెడ్డి

KTR చిట్టా మొత్తం నా దగ్గరుంది.. లోకేష్ ను అర్థరాత్రి ఎందుకు కలిశాడు : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ లపై ఆయన చేసిన చిట్ చాట్ ఆసక్తిగా ఉంది. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందని.. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవటం లేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు.. ఆమె ఇంట్లోనే ఆమెకు విలువ లేదని.. చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదంటూ మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో.. స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు.. కొందరు సూసైడల్ టెండెన్స్ తో బాధపడుతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారాయన. 

నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం, వైరుద్యం లేదని.. కేసీఆర్ సైతం నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారాయన. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని చేశారని.. 2004 నుంచి 2014 వరకు 700 టీసీఎంల నీటిని రాయలసీమకు అక్రమంగా పంపించాడని.. నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరన్నారు సీఎం రేవంత్. 

కేటీఆర్ కు ఓ గంజాయి బ్యాచ్ ఉందని.. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని.. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. డ్రగ్స్ పరీక్షకు రమ్మంటే పారిపోయింది ఎవరు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. కేటీఆర్ భాగస్వామి, ఫ్రెండ్ అయిన కేదార్.. డ్రగ్స్ తీసుకుని దుబాయ్ లో చనిపోయాడని.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం తెప్పించానన్నారాయన. బాత్రూం కడితేవాళ్లతో చర్చను నేను పోను అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారాయన. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి సోడా పోయటం తప్ప ఏమీ తెలియన్నారు. 

ALSO READ : హైకోర్టులో CM రేవంత్‎కి భారీ ఊరట.. గచ్చిబౌలి పీఎస్‎లో నమోదైన కేసు కొట్టివేత

కేటీఆర్.. ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ను అర్థరాత్రి సమయంలో మూడు సార్లు ఎందుకు కలిశాడు అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారాయన. రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని.. అర్థరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు అని.. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లలాగ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారికంగా పిలిస్తే కేంద్రంతో చర్చించటానికి.. సమీక్షలకు వెళతానని.. రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం అని వివరించారాయన.