
ఉత్తర్వులు జారీకి సీఎస్ సోమేశ్ కు కేసీఆర్ ఆదేశం
మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన 'ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.