ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నకిరేకల్ లో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాప సభకు హాజరవుతారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకొని.. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వారితోనే కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. సంతాప సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు ఉండనున్నారు.
మరిన్ని వార్తల కోసం..