రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవ కృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతోందని సీఎం ఆనందం వ్యక్తంచేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగాఅభివృద్ధి సాధించి. దేశాభివృద్ధికి దిక్సూచీగా మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజలకు ఉపగాధి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని, రైతన్నలు వ్యవసాయ పనులు ఉగాది నుంచి ప్రారంభిస్తారని అన్నారు. అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్న కేసీఆర్.. సర్కారు కృషితో వ్యవసాయరంగంలో తెలంగాణ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైందని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడుతోందని అన్నారు.