ఏపీ సీఎస్ బదిలీ.. సర్వీస్ మరో 5 నెలలు ఉండగానే వేటు

ఏపీ సీఎస్ బదిలీ..  సర్వీస్ మరో 5 నెలలు ఉండగానే వేటు

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయన సర్వీస్ మరో ఐదు నెలలు ఉండగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లలోని  ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఎల్వీ సుబ్రహ్మణ్యం కు మధ్య ఓ బిజినెస్ మార్పిడి విషయంలో వివాదం జరిగింది. ఈ విషయంపై గత నెల 31న సీఎస్ ఆఫీస్ నుంచి ప్రవీణ్ ప్రకాష్ కు నోటీసులు జారీ అయ్యాయి. మరో రెండు రోజుల్లో ఆ నోటీసులపై ప్రవీణ్.. వివరణ ఇవ్వాల్సి ఉండగా.. సుబ్రహ్మణ్యం ట్రాన్సఫర్ కావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ప్రవీణ్ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.  సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  ప్రభుత్వం  నిరభ్ కుమార్ ని నియమించింది.

Chief Secretary of Andhra Pradesh L.V Subrahmanyam has been transferred