నీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి చిన్నారి మృతి

నల్లబెల్లి, వెలుగు: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లెలో బుధవారం నీటి సంపులో పడి చిన్నారి చనిపోయింది. చిన్నారి కుటుం బ సభ్యుల కథనం ప్రకారం.. రేబల్లెకు చెందిన గుండెబోయిన కీర్తన, జగదీశ్ ల పెద్ద బిడ్డ దీత్రిక (3) ఆడుకుంటూ వెళ్లి ఓపెన్​ చేసి ఉన్న నీటి సంపులో పడిపోయింది.

పక్క ఇంటికి వెళ్లిన తల్లి కీర్తన.. ఇంటికి వచ్చి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో వెతికింది. చివరకు  నీటి సంపులో చూడగా దీత్రిక విగతజీవిగా కనిపించింది. సంఘటనా స్థలాన్ని ఎస్సై పరమేశ్​ పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.