ఇంటర్​లో ఫెయిలైనోళ్లను పాస్​ చేయండి

ఇంటర్​లో ఫెయిలైనోళ్లను పాస్​ చేయండి

హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్ మెంట్ల అసోసియేషన్ (టీఈజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితారెడ్డిని (టీఈజేఎంఏ) రాష్ర్ట అధ్యక్షడు గౌరీ సతీశ్​ నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా గౌరీ సతీశ్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ సమయంలో ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటే స్టూడెంట్స్, లెక్చరర్స్ ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టటమేనన్నారు. స్టూడెంట్స్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్చిలో ఫెయిల్ అయిన వారందరినీ అకడమిక్ ఇయర్ నష్టపోకుండా పాస్ చేయాలని కోరారు.

ప్రజల్లో ఉన్నందుకే మా ఎమ్మెల్యేలకు కరోనా