చిన్నారిని కిడ్నాప్​ చేసిన మేనత్త!

చిన్నారిని కిడ్నాప్​ చేసిన మేనత్త!

జడ్చర్ల టౌన్​,వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణంలో బుధవారం మూడేండ్ల చిన్నారిని ఆమె సొంత మేనత్త తన ప్రియుడితో కలిసి కిడ్నాప్​ చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరా నగర్​ అంగన్​వాడీ సెంటర్​ నుంచి అంజలి అనే మహిళ తన సోదరుడు ఉత్తరయ్య కూతురు శైలజను కిడ్నాప్​ చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన అంగన్​వాడీ నిర్వాహకులు వెంటనే తల్లిదండ్రులు  భాగ్యమ్మ, ఉత్తరయ్యకు తెలపడంతో పోలీస్​ స్టేషన్​ కు వెళ్లి తమ కూతురు కిడ్నాప్​ అయ్యిందని ఫిర్యాదు చేశారు.  

విషయం పసిగట్టిన కిడ్నాపర్లు అంజలి, ఆమె ప్రియుడు సైదులు ఎవ్వరి కంటపడకుండా చిన్నారిని కిడ్నాప్​ చేసిన పరిసరాల్లోనే  విడిచి పెట్టి జారుకున్నారు. కథ సుఖాంతమైనా  ఎందుకు కిడ్నాప్​ చేసిందనే  కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.