ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చుల కోసం ఈటల రాజేందర్కు ఇద్దరు చిన్నారులు విరాళమిచ్చారు. నియోజకవర్గానికి చెందిన వనితారెడ్డి, వీహార్ అనే ఇద్దరు చిన్నారులు 5 వేల 16 రూపాయల విరాళం అందించారు. కిడ్డీ బ్యాంకులో తాము దాచుకున్న సొమ్మును కమలాపూర్ మండలం శంభునిపల్లిలో ఈటలకు అందజేశారు. చిన్నారుల మంచి మనసుకు ఈటల రాజేందర్ థ్యాంక్స్ చెప్పారు.