ఎన్నికల ఖర్చుకోసం ఈటలకు విరాళమిచ్చిన చిన్నారులు

ఎన్నికల ఖర్చుకోసం ఈటలకు విరాళమిచ్చిన చిన్నారులు

ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చుల కోసం ఈటల రాజేందర్‎కు ఇద్దరు చిన్నారులు విరాళమిచ్చారు. నియోజకవర్గానికి చెందిన ‎వనితారెడ్డి, వీహార్ అనే ఇద్దరు చిన్నారులు 5 వేల 16  రూపాయల విరాళం అందించారు. కిడ్డీ బ్యాంకులో తాము దాచుకున్న సొమ్మును కమలాపూర్ మండలం శంభునిపల్లిలో ఈటలకు అందజేశారు. చిన్నారుల మంచి మనసుకు ఈటల రాజేందర్ థ్యాంక్స్ చెప్పారు.