ఢిల్లీ బోర్డర్ లోని గాజీపూర్ దగ్గర వీధి బడి ఏర్పాటైంది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కొందరు పిల్లలు కూడా వీధి బడికి వస్తున్నారు. టెంట్లలోనూ స్కూల్ నిర్వహిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ లలో టీచింగ్ చేస్తున్నారు. జనవరి 22న వీధి బడి స్టార్ట్ కాగా… 80 మంది వరకు స్టూడెంట్స్ వస్తున్నారు. మాతా సావిత్రి బాయి ఫూలే మహాసభకు చెందిన నిర్దేశ్ సింగ్ స్కూల్ రన్ చేస్తున్నారు. గాజీపూర్ దగ్గర చాలామంది పిల్లలు ఉన్నట్టు తమకు తెలిసిందని… వారి చదువులు కంటిన్యూ చేసేందుకు తాము ఇలా తోడ్పడుతున్నామని నిర్దేశ్ సింగ్ చెప్పారు.
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Children learn alphabets, counting at makeshift pathshala amid farmers' protest
Read @ANI Story | https://t.co/HIXTY5VFe0 pic.twitter.com/A8wGTqrts8
— ANI Digital (@ani_digital) February 12, 2021