స్కూళ్లు మూసేయడం కాదు.. హోటళ్లు మూసేయాలి

స్కూళ్లు మూసేయడం కాదు.. హోటళ్లు మూసేయాలి

శర్వరీ నామ సంవత్సరం కరోనా నామ సంవత్సరం అయ్యిందన్నారు  శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. కరీంనగర్ లోని రామడుగు మండలం వెలిచాల గ్రామంలో చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. దేవుడి మీద ఎంత భక్తి పెరిగితే మన శరీరంలో అంతా ఇమ్యూనిటి పెరుగుతుందన్నారు.స్కూల్ లు ముసేసిన వారు హోటళ్లు మూసేయకపోవడం బాధకరమన్నారు. గుడులు మూసేయడం కాదు మొదట హోటళ్లను మూసేయ్యాలన్నారు. కరోనా దరిచేరకుండా ఉండాలంటే ఇలాంటి పూజలు మరెన్నో చేయాలన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరగబోయే హోమం కార్యక్రమానికి లక్ష కేజీల ఆవు నెయ్యి కావాలని.. ప్రతి గ్రామం నుండి  ఒక్కరు తమ వంతుగా ఆవు నెయ్యిని సేకరించాలన్నారు.