నాపై కుట్ర చేస్తున్నరు: ప్రొటోకాల్​ కమిటీపై చిన్నారెడ్డి ఆగ్రహం

నాపై కుట్ర చేస్తున్నరు: ప్రొటోకాల్​ కమిటీపై చిన్నారెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ప్రొటోకాల్​ కమిటీపై  పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్​ చిన్నారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులతో  స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​ మురళీధరన్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్​కు హాజరయ్యేవాళ్ల లిస్టులో  చిన్నారెడ్డి పేరు లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

విషయం తెలుసుకున్న ప్రొటోకాల్​ కమిటీ.. చిన్నారెడ్డిని మురళీధరన్​వద్దకు తీసుకెళ్లింది. లిస్టులో చిన్నారెడ్డి పేరు పొరపాటున మిస్సయిందని గాంధీభవన్​ వర్గాలు చెప్పాయి. ఇదిలాఉంటే, రెండు రోజుల క్రితమే చిన్నారెడ్డిపై వనపర్తి జిల్లా నేతలు ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్​ ఇవ్వొద్దని,  ఇస్తే సహకరించేది లేదని తేల్చిచెప్పారు.