ఆదరిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా: చింత ప్రభాకర్

ఆదరిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా: చింత ప్రభాకర్

కొండాపూర్, వెలుగు : తనను ఆదరించి గెలిపిస్తే, అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి  చింత ప్రభాకర్ కోరారు. శుక్రవారం తోగర్ పల్లి, అలియాబాద్, గారకుర్తి, గిర్మాపూర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్లుగా పదవిలో లేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజలకు సేవచేశానన్నారు.

తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నిండు మనసుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, విఠల్ పాండురంగం పాల్గొన్నారు.