
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్లో పాల్గొంటూ సూపర్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. రీసెంట్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టగా ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేశారు. హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో ఈ షెడ్యూల్ జరిగింది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్లో జరుగుతుంది. దీనికోసం చిరంజీవితో పాటు టీమ్ అంతా డెహ్రాడూన్ వెళ్లారు.
అక్కడ ఓ సాంగ్తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్లో కనిపించనున్నారు.
నయనతార హీరోయిన్గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.