భద్రాచలంలో బోర్డు తిప్పేసిన చిట్ఫండ్స్ కంపెనీ..ఖాతాదారుల ఒత్తిడి తాళలేక ఉద్యోగి సూసైడ్

భద్రాచలంలో బోర్డు తిప్పేసిన చిట్ఫండ్స్ కంపెనీ..ఖాతాదారుల ఒత్తిడి తాళలేక ఉద్యోగి సూసైడ్

భద్రాచలం, వెలుగు: ఉన్నట్టుండి ఓ చిట్​ఫండ్​ కంపెనీ బోర్డు తిప్పేయడంతో అందులో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. టౌన్​లోని రిక్షా కాలనీకి చెందిన శ్రీనివాస్​ కనకదుర్గా చిట్​ఫండ్​ కంపెనీలో ఎంప్లాయ్​గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈ చిట్​ఫండ్​ కంపెనీ ఆఫీసును అర్ధంతరంగా ఎత్తేశారు. బోర్డు తిప్పేయడంతో శ్రీనివాస్​ చేర్పించిన ఖాతాదారులు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారు.

శనివారం కొందరు ఖాతాదారులు బెదిరించడంతో ఆందోళన చెందిన శ్రీనివాస్​.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. ‘కనకదుర్గా చిట్​పండ్​ కంపెనీలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నా.. చాలా మంది కస్టమర్లను అందులో చేర్చా.. బ్రాంచ్​ మేనేజర్​ తప్పించుకు తిరుగుతుంటే కస్టమర్లు నాపై ఒత్తిడి తెస్తున్నారు.. ఇలాంటి చిట్ ఫండ్​ కంపెనీల చేతిలో ఎవరూ మోసపోవద్దు..’ అంటూ సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.