ఉప్పల్, వెలుగు: క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిన ఎస్సీల హోదా తొలగింపు అన్యాయమని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తార్నాక ఐనోన్ చర్చిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్తామని తెలిపారు.
ఎస్సీ క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించేందుకు కౌన్సిల్ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో క్రిస్టియన్లపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
