భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరే గించిన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు.

ఆ దినము న పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. చర్చి ప్రేసీబేటరీ ఇన్‌చార్జి రెవరెండ్‌ శాంత య్య దైవ సందేశం చేశారు.ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భం గా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు.గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మెదక్‌ డయాసిస్‌ పరిధి లోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలా డింది..