ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ

ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు సీఐ సృజన్ రెడ్డి. మడిపల్లి గ్రామంలో బావిలో పూడిక తీయడానికి దిగిన ఇద్దరు వ్యక్తులు.. ఆక్సిజన్ అందక బావిలోనే ఉండిపోయారు.  విషయం తెలుసుకున్న జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి.. బావిలోకి దిగి వారిని బయటకు తీసుకొచ్చారు. 108లో హాస్పిటల్ కు తరలించారు.