న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సీఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.
- ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్సభలో ఆమోదం పొందింది.
- ప్రతిపక్షాల నిరసనల మధ్య 2019 డిసెంబర్ 11న ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లభించింది.
- పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి
- వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్
- మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం.
- 64 ఏండ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం –1955ను ఇది సవరించింది.
- భారత పౌరసత్వం పొందేందుకు దేశంలో 11 ఏండ్లపాటు నివసించడంకానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది.
- సీఏఏ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేండ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి.
- ఇందులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.
- ఇది రాజ్యాంగంలోని మానవులకు సమాన హక్కులు కల్పించే ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి.