ఒక్క స్కూల్.. 55,547 మంది స్టూడెంట్లు
ప్రపంచంలో ఎక్కువ మంది స్టూడెంట్లున్న బడిగా గిన్నిస్ రికార్డు
ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సిటీ మాంటిస్సోరి స్కూల్ గిన్నిస్ రికార్డుకెక్కింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది స్టూడెంట్లున్న బడిగా చరిత్ర సృష్టించింది. 2019–20లో ఈ బడి 18 బ్రాంచుల్లో కలిపి 55,547 మంది స్టూడెంటున్నారని స్కూల్ ఫౌండర్ జగదీశ్ గాంధీ చెప్పారు. ‘ఐదుగురున్నప్పుడు స్కూల్ను స్టార్ట్ చేశా. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ అవుతుందని ఊహించలేదు. స్కూల్ను నమ్మి స్టూడెంట్లను పంపిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు’ అని గాంధీ అన్నారు. ‘ఫిజికల్గా, సోషల్ యాక్టివిటీస్లో, ఆధ్యాత్మికతలో బ్యాలెన్స్డ్గా ఉండేలా స్టూడెంట్లను తీర్చి దిద్దుతాం. శాంతి, ఐకమత్యంతో వచ్చే లాభాలేంటో వివరిస్తాం’ అని చెప్పారు.