హైదరాబాద్ సిటీ, వెలుగు: రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం సికింద్రాబాద్ పికెట్ ప్రాంతంలోని రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పలువురు రేషన్ కార్డుదారులతో మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం సహా ఇతర సరుకులు నిర్దేశిత పరిమాణంలో, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. డీలర్ ప్రవర్తనపై కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
