రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజేఐ

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజేఐ

ములుగు జిల్లా: రామప్ప దేవాలయాన్ని పరిశీలించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  ఎన్ వీ రమణ. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన NV రమణకు.. ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,  పలువురు హైకోర్టు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో గుడిలోకి తీసుకెళ్లారు అర్చకులు. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు NV రమణ దంపతులు. రామప్పకు యునెస్కో గుర్తింపు తర్వాత మొదటిసారి సందర్శించారు సీజేఐ. ఆలయమంతా తిరిగి శిల్ప సౌందర్యాన్ని పరిశీలించారు NV రమణ.