కాంగ్రెస్​లో చేరికపై బంగారు శృతి క్లారిటీ

కాంగ్రెస్​లో చేరికపై బంగారు శృతి క్లారిటీ

హైదరాబాద్: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీజేపీ నేత బంగారు శృతి స్పందించారు. పార్టీ మారబోయేది లేదని క్లారిటీ ఇచ్చారు. ‘ బీజేపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు. నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో ఎవరు ఉన్నా వారి గెలుపునకు కృషి చేస్త. త్వరలో మీ ముందుకు వస్త’అని ట్విట్టర్​లో వీడియో పోస్ట్​పెట్టారు. కాగా నిన్న ఆమె సీఎం రేవంత్ ను కలవడంతో పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.