- ఐడీ, పాస్ వర్డ్ బ్లాక్ చేస్తున్న కాలేజీల మేనేజ్మెంట్లు
- ఇంటర్ స్టూడెంట్స్, పేరెంట్స్ లో ఆందోళన
- కట్టిన వాళ్లకు అందని పూర్తి మెటీరియల్
- వీకెండ్, మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ సబ్జెక్ట్ అర్థం కాక మానసికంగా కుంగిపోతున్న స్టూడెంట్స్
- ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలంటున్న టీపీజేఎంఏ
ఎస్ ఆర్నగర్లోని ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంఈసీ గ్రూప్లో జాయిన్ అయ్యా . మొదట్లో అడ్మిషన్ ఫీజు రూ.5 వేలు, మొత్తం ఫీజు 28 వేలు అని చెప్పారు. మూడు టర్మ్ ల్లో ఎప్పుడైనా ట్యూషన్ ఫీజు కట్టొచ్చని చెప్పగా అడ్మిషన్ తీసుకున్నా. ఆన్లైన్ క్లాసులకు జూమ్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చారు. మెటీరియల్ ఇవ్వలేదు. పదిరోజుల కిందట మెటిరియల్ కావాలంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలని చెప్పి, ఆన్లైన్ క్లాస్లకు జూమ్డిస్కనెక్ట్చేశారు. త్వరలో ఎగ్జామ్స్ కూడా కండక్ట్చేస్తుండగా భయంగా ఉంది”. అని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ రవి చెప్పాడు.
“మా బాబు వారం రోజులుగా ఆన్లైన్క్లాసులు వినడం లేదు. ఏమైందని అడిగితే ఫీజు కట్టమంటున్నారని చెప్పాడు. అడ్మిషన్ టైంలోనే ఫీజు కట్టాం. అడ్మిషన్ తీసుకునేంత వరకు నచ్చినప్పుడు ఫీజు కట్టొచ్చని కాలేజీ మేనేజ్మెంట్చెప్పింది. ఇప్పుడేమో చెప్పాపెట్టకుండా క్లాసులు కట్ చేస్తున్నారు. ఇట్ల జేస్తరని అనుకోలేదు. ”అని ఇంటర్ స్టూడెంట్ వెంకట్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్లు మొదట్లో స్టూడెంట్స్ జాయిన్ అయితే చాలని.. ఫీజు ఎప్పుడైనా చెల్లించవచ్చని చెప్పి, అడ్మిషన్ తీసుకున్నాక చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు కడితేనే క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ అంటూ స్టూడెంట్స్, పేరెంట్స్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. జాయినింగ్టైమ్లో అడ్మిషన్ ఫీజు మాత్రమే కడితే సరిపోతుందని స్టూడెంట్స్ఇంటికి వెళ్లి మరి జాయిన్ చేయించుకున్నాయి. మొత్తం ఫీజుని మూడు, నాలుగు టర్మ్ల్లో చెల్లించొచ్చని నమ్మించి, ఇప్పడు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు జులై నుంచే ఆన్లైన్ క్లాసులు షురూ చేశాయి. మొదట్లో మేనేజ్మెంట్లు అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ను అందరిని ఆన్లైన్ క్లాసులకు అనుమతించాయి. ఐడీలు, పాస్ వర్డ్లు ఇచ్చాయి. ఇప్పుడు మాట మార్చాయి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కడితేనే క్లాసులు, మెటిరియల్ ఇస్తామని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనలో పడిపోయారు. మరో వైపు ఫీజు కట్టిన స్టూడెంట్స్కు కూడా సగం మెటీరియల్నే ఇస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులు సగం విన్నాక ఇప్పుడే బంద్ చేస్తే ఎగ్జామ్స్ ఎలా రాయాలని టెన్షన్ పడుతున్నారు. ఇదిలాగే ఉంటే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని, త్వరగా ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని విద్యానిపుణులు, పేరెంట్స్కోరుతున్నారు. వివిధ జాగ్రత్తలతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభిస్తుంటే మన దగ్గర ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫీజు కడితేనే.. మెటీరియల్
ఇంటర్ స్టూడెంట్స్కు స్టడీ మెటీరియల్ సమస్యలు తప్పడం లేదు. ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ ఇలా అన్ని గ్రూప్ ల వారికి ఇదే పరిస్థితి. కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లుమెటీరియల్ని ప్రిపేర్ చేస్తున్నాయి. బయట మార్కెట్లోవి వద్దని, తమ దగ్గరే తీసుకోవాలని మెసేజ్ లు పంపిస్తున్నాయి. పూర్తి ఫీజులో 20 నుంచి 40శాతం కట్టిన తర్వాత మాత్రమే ఇస్తామని కండీషన్ పెడుతున్నాయి. దీంతో స్టూడెంట్ల పేరెంట్స్కు వేరే ఆప్షన్ లేక ముందుగానే ఫీజులు చెల్లిస్తున్నారు. కాలేజ్ ఫీజు, మెటీరియల్కి 3 నుంచి 5 వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టిన స్టూడెంట్స్కు పూర్తిస్థాయి స్టడీ మెటీరియల్ ఇవ్వడంలేదు.
ఆన్లైన్ క్లాసులతో తీవ్ర ఒత్తిడి
ఆన్లైన్క్లాసుల కారణంగా స్టూడెంట్స్ మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ లు అర్థం కావట్లేదని స్టూడెంట్స్ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిజికల్ క్లాసులు లేని కారణంగా స్టూడెంట్స్ , లెక్చరర్లకు మధ్య కమ్యూనికేషన్ ఉండడం లేదు. డౌట్స్వస్తే స్టూడెంట్స్లెక్చరర్లను అడగలేకపోతున్నారు. తద్వారా మానసిక ఆందోళన ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలి. సెప్టెంబర్ లో విద్యాసంస్థల రీ ఓపెన్ అంటుండగా తేదీ చెప్పడం లేదు. సర్కార్ త్వరగా తేదీని ప్రకటించాలి.
–గౌరీ సతీష్, ప్రెసిడెంట్, తెలంగాణ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్అసోసియేషన్