పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటీ

పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటీ

పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పేంటని ప్రశ్నించారు సీఎల్పీనేత భట్టి విక్రమార్క. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ భవన్ లో రాజీవ్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. కేసీఆర్ రాష్ట్రాల పర్యటన ఆయన వ్యక్తిగతమని చెప్పారు భట్టి. కానీ నకిలీ విత్తనాలు, రుణమాఫీ సమస్యలకు పరిష్కారం చూపి దేశంలో పర్యటిస్తే బాగుండేదన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉందని..ఈ సమయంలో కేసీఆర్ మిగితా రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందించడానికి వెళ్లడం హాస్యాస్పదమన్నారు. భారత్ జోడో నినాదం మరోసారి దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం

పోలీసులు బాడీ వార్న్ కెమెరాలు ధరించాలి

ఆదర్శ ప్రభుత్వ పాఠశాల @ కవార్థా