
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తక్షణమే ఆసుపత్రుల్లో రిక్రూట్మెంట్ చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ లెక్కలు, ఆయన సంగతి తేలుస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కరోనాపై ప్రభుత్వం వైఫల్యం, కృష్ణానది జలాలపై ప్రధానంగా చర్చ జరిపి సీఎం సంగతి తేలుస్తానన్నారు. జిల్లా ఆస్పత్రిలో మందులు, రిక్రూట్మెంట్ , మిషనరీస్ లేవని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. సీఎం ఫాం హౌస్ నుండి బయటకు వచ్చి పేదల కష్టాలు చూడాలన్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రిని 350 బెడ్ల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు.. కానీ అమలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.మూడు లక్షల కోట్లు అప్పులు చేశారు కానీ ఆస్పత్రుల్లో ఒక్క రిక్రూట్మెంట్ లేదు వైద్యం కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు.
కేసీఆర్ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కై కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం రోజు 11 టిఎంసిలు ఎత్తి పోస్తున్న సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కృష్ణ జలాలను ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని.. దీంతో తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.
త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్
ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్