అక్టోబర్ 31 నుంచి జూబ్లీహిల్స్లో సీఎం ప్రచారం

అక్టోబర్ 31 నుంచి జూబ్లీహిల్స్లో సీఎం ప్రచారం
  • నవంబర్ 8, 9వ తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. ర్యాలీలు, కార్నర్ మీటింగ్​లు, ఇంటింటి ప్రచారంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో సీఎం రేవంత్​ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 

ఈ మేరకు సీఎం ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్​ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 31నరాత్రి 7 గంటలకు వెంగళ్​రావు నగర్​లో, రాత్రి 8 గంటలకు సోమాజిగూడలో, నవంబర్ 1న రాత్రి 7 గంటలకు బోరబండలో, 8గంటలకు ఎర్రగడ్డలో, నవంబర్ 4న షేక్​పేట1లో రాత్రి 7గంటలకు, రహైమాత్​నగర్​లో రాత్రి 8గంటలకు, నవంబర్ 5న రాత్రి  7గంటలకు షేక్​పేట–2, రాత్రి 8 గంటలకు యూసఫ్​గూడలో, నవంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు డివిజన్లలో నిర్వహించే మోటర్​ సైకిల్​ ర్యాలీల్లో పాల్గొంటారు. నవంబర్​ 9న ఉదయం 10 గంటలకు నిర్వహించే మోటర్​ సైకిల్​ ర్యాలీ చేపట్టనున్నారు.